PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది.. టిజి భరత్

1 min read

– మసీదు అభివృద్ధి కోసం ఎలాంటి సహకారం కావాలన్న అందిస్తాం.. టిజి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రంజాన్ ఇఫ్తార్ విందుకు తనను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని పెద్దమార్కెట్ వద్ద ఉన్న జామియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముందుగా రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో టిజి భరత్ పాల్గొన్నారు. రోజా దీక్ష విరమించిన ముస్లింలందరికీ టిజి భరత్ ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. భరత్ మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో గొప్పవన్నారు. జామియా మసీదుతో పాటు ఇతర మసీదుల నుండి వచ్చిన ముస్లింలకు కూడా భోజనాలు ఏర్పాటు చేసిన హమీద్ ను ఆయన అభినందించారు. అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక తమ టీజీవి సంస్థల తరుపున మసీదు అభివృద్ధి కోసం ఎలాంటి సహకారం కావాలన్న అందజేస్తామని టిజి భరత్ తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ హమీద్, నేతలు సర్తాజ్, ఆయాజ్, కలీం, షా నవాజ్, దిల్ నవాజ్, తదితరులు పాల్గొన్నారు.

About Author