NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రేమోన్మాది ఘాతుకం.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ‌రంగ‌ల్ లో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. అజార్ అనే వ్యక్తి కాకతీయ వర్శిటీ విద్యార్థిని అనూషపై దాడి చేశాడు. కత్తితో విద్యార్థిని గొంతు కోశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. లక్నేపల్లికి చెందిన యువతి కాకతీయ వర్శిటీలో ఎంసీఏ చదువుతోంది. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆ యువతిని ఉన్మాది వేధిస్తున్నాడు. శుక్రవారం ఉదయం యువతి ఇంటికి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసిన వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అలాగే ప్రజా సంఘాల నేతలు కూడా ఆస్పత్రికి వచ్చారు.

                                 

About Author