PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచేలా చొరవ చూపాలని ఎంపీడీవో మధుసూదనరెడ్డి ఉపాధి సిబ్బందికి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పనులపై ఉపాధి సిబ్బందితో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామములో 200 మంది తగ్గకుండా పనిలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అందుకు తగిన విధంగా డిమాండు తీసుకోవాలని సిబ్బందికి సూచించామన్నారు. ఎవరికైతే ఆధార్ ట్యాగ్ కాలేదో వారికి ఆధార చేయించాలన్నారు అలాగే ప్రతి ఇంటికి రెండు నుంచి ఐదు వరకు మునగ చెట్లు ఇవ్వడం జరుగుతుందని వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో ఏపీవో ప్రతాప్ ఈసీ సుబ్బన్న క్షేత్ర సహాయకులు, టి ఏ లు పాల్గొన్నారు.

About Author