NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెగ‌లు క‌క్కుతోన్న చమురు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. మన దేశం కొనుగోలు చేసే బ్యారల్‌ చమురు సగటు ధర పదేళ్ల గరిష్ఠ స్థాయి 121.28 డాలర్లకు చేరింది. ఒక దశలో ఇది 122.80 డాలర్లకు చేరినా తర్వాత కొద్దిగా దిగొచ్చింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్ వివ‌రాల ప్ర‌కారం ఈ ఏడాది ఫిబ్రవరి 25-మార్చి 29 మధ్య ఇది 111.86 డాలర్లు, మార్చి 30-ఏప్రిల్‌ 27 మధ్య 103.44 డాలర్ల వద్ద ఉంది. రష్యాపై ఆంక్షలు, ఒపెక్‌ దేశాల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గత నెల రెండో వారం నుంచి ముడి చమురు ధర సెగలు కక్కుతోంది.

                                           

About Author