PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీర్ల సేవలను ఓర్వలేని ప్రతిపక్షాలు కుయుక్తులతో పన్నాగం ..  

1 min read

 పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఓర్వ లేక వారిపై టిడిపి జనసేన పార్టీలు కుయుక్తులతో పన్నాగం పన్నుతున్నారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటీ శ్రీదేవి విమర్శలు విమర్శలు గుప్పించారు.వాలంటీర్ల సేవలతో ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు,ఎల్లో మీడియా ఏకమై ఎన్ని విమర్శలు చేసినా అకుంఠిత దీక్షతో సేవలు అందిస్తున్నారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కొనియాడారు. మంగళవారం స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీదేవవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేవా వజ్రా, సవా రత్న, సేవా మిత్రలుగా ఎంపికైన వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న నగదు ప్రోత్సాహాన్ని అందించి వారిని ఘనంగా సత్కరించారు.తమ పరిధిలో ఉన్న 50 కుటుంబాలను తమ వాళ్లుగా భావించి సేవలందిస్తున్న వాలంటీర్లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న టిడిపికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన జగనన్నకు వచ్చిన ఆలోచన 40 ఇయర్స్ ఇండస్ట్రీ  చెప్పుకునే వాళ్లకు రానందుకు సిగ్గుపడాలని ఆమె ఎద్దేవా చేశారు. వాలంటీర్ల విధానం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేస్తున్న జగనన్న ఆలోచనలకు ఇతర రాష్ట్రాలకు చెందిన  ప్రముఖ పార్టీల నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ దాసు, జెడ్పీటీసీ ఉరుకుందమ్మ, ఎంపీడీఓ రామారావు బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రంగడు,మండల కన్వీనర్ కారం నాగరాజు, వైస్ ఎంపిపి బలరాముడు, మరియు పత్తికొండ మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు, షాదిఖాన కమిటీ ప్రెసిడెంట్ హనీఫ్,వార్డ్ మెంబర్లు, మైనారిటీ నాయకులు,పత్తికొండ మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author