PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ జిల్లా ప్రజలు హత్యలు చేస్తారన్న ఉద్దేశంతో మాట్లాడలేదు !

1 min read

పల్లెవెలుగువెబ్ : తన వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కడప జిల్లా ప్రజలు హత్యలు చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య ఘటనను ఉద్దేశించి మాత్రమే.. వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన వ్యాఖ్యలతో కడప జిల్లా ప్రజలకు ఎలాంటి సంబంధంలేదని సోమువీర్రాజు పేర్కొన్నారు. అంతకుముందు ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు కట్టించామని కడప ఎయిర్‌పోర్టును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌ల విషయం కేంద్రం చూసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు సరిగా వేయాలని సోము వీర్రాజు సూచించారు.

       

About Author