NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌ధాని ఇంటిని ముట్టడించిన ప్ర‌జ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీలంక‌లో సంక్షోభం తీవ్ర‌స్థాయిలోకి చేరింది. ఏకంగా ప్రధాని మహింద్ర రాజపక్సే ఇంటిని ప్ర‌జ‌లు ముట్టడించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బారికేడ్లు విరగొట్టి ప్రధాని ఇంటి వైపునకు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రధాని ఇంటివద్దకు భారీ ఎత్తున పోలీసులు, ఆర్మీ బలగాలు చేరుకున్నాయి.

                                     

About Author