PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసులు వైకాపా కార్యక‌ర్తల్లా ప‌నిచేస్తున్నారు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వైకాపా దౌర్జన్యాల‌కు, అక్రమాల‌కు పాల్పడుతోంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. పోలీసులు వైకాపా కార్యక‌ర్తల్లా పనిచేస్తున్నార‌ని విమ‌ర్శించారు. దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని, దీనిని అడ్డుకోవాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. టీడీపీ నేత‌లు బోండా ఉమ‌, బోడే ప్రసాద్, అశోక్ బాబు వైకాపా అక్రమాల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. కుప్పం ప‌రిస‌ర ప్రాంతాల్లో మంత్రులంతా మోహ‌రించార‌ని తెలిపారు. బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌బోమ‌ని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా అప‌హాస్యం చేస్తోంద‌ని దుయ్యబ‌ట్టారు. ప్రతి అంశాన్ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లినా.. క్షేత్రస్థాయిలో చ‌ర్యలు తీసుకోవ‌డంలేద‌ని తెలిపారు. ఎన్నిక‌ల ఏజెంట్లుగా ఉన్నవారిని అర్థరాత్రి అరెస్టు చేశార‌ని తెలిపారు.

About Author