PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాస్క్ పెట్టుకోలేద‌ని.. సైనికుడిని చిత‌క‌బాదిన పోలీస్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మాస్క్ ధ‌రించ‌లేద‌ని ఓ ఆర్మీ జవాన్ పై పోలీసులు దాడి చేశారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని మ‌యూర్ బండ్ జిల్లా క‌ర్మబ‌జార్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నం పై వెళ్తున్న ఆర్మీ జ‌వాన్ ను మాస్క్ పెట్టుకోలేద‌ని పోలీసులు ఆపారు. అనంత‌రం లాఠీల‌తో చిత‌కబాదారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సైనికుడి ప‌ట్ల పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోలీసుల తీరును నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. దేశ ర‌క్షణ‌లో కీల‌కంగా వ్యవ‌హ‌రించే సైనికుడి ప‌ట్ల పోలీసుల వ్యవ‌హార తీరుపై నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన పోలీసులు దాడికి పాల్పడ్డ ముగ్గురు పోలీసు అధికారులపై చ‌ర్యలు తీసుకున్నట్టు ఝార్ఖండ్ పోలీస్ శాఖ ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది.

About Author