PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PRC జీవో ను వెంటనే రద్దు చేయాలి

1 min read

ఉద్యోగులతో  మళ్ళీ చర్చించాలి … వారు లేకుండా ప్రభుత్వం పని చేయలేదు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్​ కాదని…. ఎనిమీ గవర్నమెంట్​గా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఫిట్​మెంట్​, హెచ్​ఆర్​ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. గురువారం కర్నూలు మౌర్య ఇన్​ హోటల్​లోని పరిణయ ఫంక్షన్​ హాల్​లో  కర్నూలు జిల్లా అధ్యక్షులు కోనంకి రామస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  సోము వీర్రాజుతోపాటు రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్​ , ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి డా. పార్థసారధి, బీజేపీ సీనియర్​ నాయకులు హరీష్​ బాబు, ఆదోని నియోజకవర్గ ఇన్​చార్జ్​ విట్టారమేష్​ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ  ఉద్యోగులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేయలేదన్నారు. ఉద్యోగులు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. పీఆర్​సీ జీవోను వెంటనే రద్దు చేసి.. ఉద్యోగులను మళ్లీ చర్చకు పిలిపించి.. సామరస్యంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

About Author