NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారం పై స్పందించిన రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు పంపించింది. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతకుముందు, ఎంపీ మాధవ్ అంశంపై మహిళా జేఏసీ నేతలు మాధవ్ పై చర్యలు తీసుకునేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. అటు, ఉప రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్, కేంద్రమంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు.

                                         

About Author