PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓడిపోయిన గర్వం, అహంకారం తగ్గలేదు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేతల పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ నేతలకు గర్వం, అహంకారం తగ్గలేదన్నారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిందని లెక్కలేసి చెప్పారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మరో వందేళ్ల వరకూ అధికారంలోకి రావొద్దని కోరుకుంటున్నట్లుగా ఉందంటూ చురకలేశారు. రెండేళ్లుగా భారత్ కోవిడ్‌పై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.

  

About Author