PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి… టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమస్యలు పరిష్కారం అవ్వకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు చెబుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రం కాకుండా ప్రభుత్వం స్పందించాలన్నారు. ఇక వీరి సమస్యలను తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళతానన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు తప్పకుండా కృషి చేస్తానని భరత్ అన్నారు. సరైన నాయకుడు అధికారంలో ఉంటే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author