NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు :హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ కొత్తకోట మోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని సంక్షేమ భవన్ నందు జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పోతులపాడు నాగరాజు, ఈశ్వర్ యాదవ్, బి భాస్కర్ నాయుడు తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, సన్న బియ్యం సరఫరా చేయాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, వర్కర్ పోస్టులు భర్తీ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచి ప్రతి నెల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి నాయకులు ఆకుమల్ల శ్రీదర్, సుభాన్, బివిఆర్ నాయుడు, కె శ్రీనివాసులు, ఎం రవి, రవి కుమార్ తదితరులు పాల్గోన్నారు.

About Author