PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను,  సమస్యలను  ప్రభుత్వం పరిష్కరించాలని  గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నందికొట్కూరు మండల అధ్యక్షుడు  జక్కుల మహేష్ కోరారు. గురువారం నందికొట్కూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోరుతూ  వీఆర్ఏలు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి, రికవరీ చేసిన డిఏ ను తిరిగి చెల్లించాలి,  నామినీలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను వీఆర్ఏలుగా గుర్తించాలి, మరణించిన వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలి, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో  గౌరవ అధ్యక్షులు పుల్లయ్య , కార్యదర్శి ఏ శివన్న, మహేశ్వరుడు, వీఆర్ఏ లు సుధాకర్ సుబ్బలక్ష్మమ్మ మాధవి తిరుపాలు శ్రీనివాసులు సుజాత తదితరులు పాల్గొన్నారు.

About Author