PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళను మింగేసిన కొండచిలువ !

1 min read

పల్లెవెలుగువెబ్ : రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన 54 ఏళ్ల మహిళను 22 అడుగుల భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన జరా ఆ తర్వాత అదృశ్యమైంది. రెండు రోజులైనా జాడ లేకపోవడంతో అమె భర్త అడవిలో గాలించాడు. ఈ క్రమంలో ఓ చోట ఆమె చెప్పులు, జాకెట్, హెడ్‌స్కార్ఫ్, కత్తి కనిపించాయి. దీంతో ఆయన అధికారులకు సమాచారం అందించాడు. అదే రోజు సహాయక సిబ్బందితో కలిసి అదే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఓ భారీ కొండచిలువను గమనించారు. దాని కడుపు ఉబ్బెత్తుగా ఉండడంతో అనుమానించారు. అదృశ్యమైన జరాను అది మింగేసి ఉంటుందని భావించి దానిని బంధించారు. ఆ తర్వాత గ్రామస్థులందరూ కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

About Author