PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధార్మిక ప‌రిష‌త్ తీర్మానం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేదు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌డ‌ప జిల్లా బ్రహ్మంగారి మ‌ఠం పీఠాధిప‌తి ఎంపిక పై ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. తాత్కాలిక పీఠాధిప‌తిగా ప్రత్యేక అధికారిని నియ‌మిస్తూ ధార్మిక ప‌రిష‌త్ చేసిన తీర్మానం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేద‌ని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవ‌హారంలో నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని హైకోర్టు మ‌ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పీఠాధిప‌తి హోదా త‌మ‌కే ద‌క్కాలంటూ దివంగ‌త పీఠాధిప‌తి రెండో భార్య మారుతి మ‌హాల‌క్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక అధికారికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేద‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా జీవో జారీ చేశార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. మ‌రోవైపు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే జీవో జారీ చేశామ‌ని ప్రభుత్వం త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు జారీ చేసింది.

About Author