PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే అధ్వర్యంలో స్పందన  అర్జిదారులకు అన్నదానం

1 min read

– మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్పందన అర్జీ  దారులకు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీ కాంత్ రెడ్డిగారి  ఆధ్వర్యంలో  అన్నదానం కార్యక్రమం కొనసాగుతుంది. సోమవారంఅన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ గారి సౌజన్యంతో  అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమానికి వచ్చే అర్జిదారులకు  ప్రతి సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా నలుమూలల నుంచి వస్తున్న వారికి రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి,దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియజేస్తున్నారు అర్జీదారులు..ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు శుగవాసి శ్యాం కుమార్,జావేద్,అమీర్ ఖాన్ ,బేపారి జబిబుల్లా ఖాన్,తదితరులు పాల్గొన్నారు.

About Author