PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డును పునర్ నిర్మించాలి

1 min read

– బీఎస్పీ పార్టీ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల నుండి బ్రాహ్మణపల్లి వరకు తారు రోడ్డును పునర్ నిర్మించాలని బీఎస్పీ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇంచార్జి ఎల్ స్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు అలాగే కర్నూల్ నుండి రోజు వందల సంఖ్యలో ఆటోలు బస్సులు టూ వీలర్స్ ల్లో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారని అయితే ఈ రోడ్డు ప్రయాణికులకు నరక ప్రయాణంగా మారిందనీ కొన్ని సందర్భాల్లో రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఎన్నో రోజుల నుండి ఈ రోడ్డు అధ్వానంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు గాని ఆర్ అండ్ బి అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని.ఈ రోడ్డు నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్ అండ్ బి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే జిందాల్ పరిశ్రమ యాజమాన్యం జిందాల్ నుండి నంద్యాల వరకు సిమెంట్ రోడ్డు వేశారు గాని మరి భారీ వెహికల్స్ గడివేముల నుండి నందికొట్కూరు కు తిరుగుతున్న నందికొట్కూరు వైపు సిమెంట్ రోడ్డు ఎందుకు నిర్మించలేదనీ ఆయన అన్నారు. అధికారులు చొరవ తీసుకొని రోడ్డును పునర్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయంపై బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

About Author