PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుళ్లిన ఆకుల‌ను తొల‌గించాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శివ‌సేన‌అనే మహావృక్షం నుంచి కుళ్లిన ఆకులను తొలగించి పడేయాల్సిందేనని ఆ పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే అన్నారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ.. ‘‘శివసేన నుంచి ఠాక్రేలను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. మనవెంట ఎవరూ లేరనే భావిద్దాం. శివసేనను కొత్తగా నిర్మించుకుందాం’’ అని కార్యకర్తలను పిలుపునిచ్చారు. తాను వీడింది సీఎం బంగ్లా మాత్రమే తప్ప పట్టుదలను, పోరాట పటిమను కాదన్నారు. గతంలోనూ ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పార్టీ మళ్లీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

                                                            

About Author