PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహనీయుల త్యాగాలు మరువలేనివి..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ఐక్యత కోసం త్యాగం ఒకరు, దేశ ఐక్యత కోసం మరొకరు కృషి చేసిన మహనీయుల త్యాగాలు మరువలేనివని పిసిసి అధికార ప్రతినిధి ఏ కరుణాకర్ బాబు వారి సేవలను కొనియాడారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు 71 వ వర్ధంతి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 73 వ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన  కార్యకర్తల సమావేశంలో కరుణాకర్ బాబు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు  ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి యైన మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములుని వారి సేవలను కొనియాడారు అనంతరం ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న  మాట్లాడుతూ  భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్  స్వాతంత్ర్య  సమరయోధుడిగా నెహ్రూ మంత్రివర్గంలో హోం శాఖా మంత్రిగా ఉప ప్రధానిగా పదవులు నిర్వహించారని  స్వాతంత్ర్యా నంతరం భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించిన హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాధీశులను సైనిక చర్యతో మట్టికరిపించి దేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్కి దక్కుతుందని కనుక ఇలాంటి మహనీయులను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని ప్రసంగించారు.  ముందుగా పార్టీ కార్యాలయంలో  అమరజీవి పొట్టి శ్రీరాములు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్  చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి ఏ కరుణాకర్ బాబు ఐ ఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పోతుల శేఖర్ ఎస్సీ సెల్ తాత్కాలిక జిల్లా చైర్మన్ ఈ లాజరస్ సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాజా హుస్సేన్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల డిసిసి కార్యదర్శులు రియాజుద్దీన్ యజాస్ అహ్మద్ ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ అభి నాయుడు లక్ష్మయ్య రాజేంద్రప్రసాద్ షేక్ మాలిక్ వశీభాష ఆనందం జేమ్స్ బాలాజీ ప్రసాద్ మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి పుష్పలీల కరుణమ్మ అబీద షాహిద మొదలగు వారు పాల్గొన్నారు.

About Author