PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాడు జాతిపిత‌ను చంపిన సిద్ధాంత‌మే.. నేడు విద్వేషం నింపుతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: మన జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు దేశంలో విద్వేషాన్ని నింపుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి మాట్లాడారు. నాడు జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని.. కష్టపడి సంపాదించుకున్న మన స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు.

                                     

About Author