PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాకు పీసీసీ రావ‌డానికి అదే కారణం : రేవంత్ రెడ్డి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రాజీవ్ రైతు దీక్ష పేరుతో నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన స‌భ విజ‌య‌వంతం కావ‌డం… ఆ స‌మాచారం ఢిల్లీ కాంగ్రెస్ కు చేర‌డం వ‌ల్లనే త‌న‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశార‌ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీమంత్రి సుద‌ర్శన్ రెడ్డిది కీల‌క పాత్ర అని చెప్పారు. మూత‌ప‌డ్డ నిజాం షుగ‌ర్ ఫ్యాక్టరీని 100రోజుల్లో తెరిపిస్తామ‌ని హామీ ఇచ్చి టీఆర్ఎస్ నిల‌బెట్టుకోలేక‌పోయింద‌ని అన్నారు. కేసీఆర్ ఓసారి ఎమ్మెల్యేగా, ఓసారి సింగిల్ విండో డైరెక్టర్ గా పోటీ చేసి ఓడిపోయాని రేవంత్ రెడ్డి అన్నారు. అబ‌ద్ధాలు చెప్పి గెలిచిన క‌విత రైతుల‌కు ఇచ్చిన హామీ నిల‌బెట్టుకోలేక‌పోవ‌డంతో రైతులు నామినేష‌న్ వేసి ఓడించార‌ని తెలిపారు. ఎంపీ అర‌వింద్ ప‌సుపు బోర్డు తెస్తాన‌ని చెప్పి మోసం చేస్తున్నార‌ని అన్నారు.

About Author