PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌న్ను గెలిపించే బాధ్య‌త స‌చివాల‌య సిబ్బందిదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తనను గెలిపించే బాధ్యత వలంటీర్లు, సచివాలయ సిబ్బందిదేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవిలో నుంచి నన్ను ఎందుకు తీసేశారని కొంతమంది అడుగుతున్నారని, బంధువును కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించానని సీఎం చెబుతున్నారన్నారు. వైసీపీ బలోపేతానికి జిల్లాలో గడపగడపకు తాను తిరుగుతానని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు చెప్పిన వారినే వలంటీర్లుగా నియమించామన్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్య కారకులు వలంటీర్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

                                     

About Author