PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ్ఞాన శిబిరాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   దసరా సెలవుల సందర్భంగా పత్తికొండ శాఖ గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే. ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయంలో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలని, గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లాలో అన్ని గ్రంథాలయాల్లో రెగ్యులర్ సిబ్బంది ఉన్నచోట ఈ విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రంధాలయ సభ్యత్వం చేసిన విద్యార్థిని విద్యార్థులకు రసీదులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రాంకుమార్ మరియు 50 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author