PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య సేవలు మరవలేనివి

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: దివంగత మాజీ మంత్రి, రాజంపేటనియోజకవర్గ టిడిపి సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య సేవలు మరువలేనివన్నారు తెలుగు యువత మాజీ జిల్లా కార్యదర్శి చెన్నూరి శ్రీనివాసులు, మాజీ ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ నేతి రమేష్. శనివారం మండల కేంద్రంలో బ్రహ్మయ్య ద్వితీయ వర్థంతి ని ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు జరుపుకున్నారు. బ్రహ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పసుపులేటి బ్రహ్మయ్య మృతి టిడిపికి తీరని లోటన్నారు. రాజంపేట నియోజకవర్గంలో టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం ఇంటింటికీ తెలుగుదేశం అనే నినాదంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలకు దగ్గరై నిరంతరం ఎనలేని కృషి చేసి కార్యకర్తల కు మనోధైర్యాన్ని నింపిన ఘనత పసుపులేటి బ్రహ్మయ్య కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వీఆర్డీఎస్ ఛైర్మన్ సురేంద్ర రెడ్డి, టిడిపి కార్యకర్తలు ఛాన్ బాషా, తుమ్మల రమేష్, నేతి రామ్మోహన్, పవన్, శివ, పవన్ కుమార్ రెడ్డి, పాల్గొన్నారు.

About Author