PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి… ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ..

1 min read

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..

పల్లెవెలుగు న్యూస్ గడివేముల:  ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఓర్వలేక వారిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.అభివృద్ధి పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి వరం.అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రశంసించారు వాలంటీర్ల సేవలతో ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు,ఎల్లో మీడియా ఏకమై ఎన్ని విమర్శలు చేసినా అకుంఠిత దీక్షతో సేవలు అందిస్తున్నారని పత్తికొండ ఎమ్మెల్యే  కొనియాడారు. మంగళవారం స్థానిక గడివేముల పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేవా వజ్రా, సవా రత్న, సేవా మిత్రలుగా ఎంపికైన వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న నగదు ప్రోత్సాహాన్ని అందించి వారిని ఘనంగా సత్కరించారు.తమ పరిధిలో ఉన్న 50 కుటుంబాలను తమ వాళ్లుగా భావించి సేవలందిస్తున్న వాలంటీర్లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న టిడిపికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన జగనన్నకు వచ్చిన ఆలోచన టిడిపి ప్రభుత్వం గతంలో అమలు చేయనందుకు సిగ్గుపడాలన్నారు  వాలంటీర్ల విధానం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేస్తున్న జగనన్న ఆలోచనలకు ఇతర రాష్ట్రాలకు చెందిన  ప్రముఖ పార్టీల నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ జెడ్పీటీసీ ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి , వైస్ ఎంపీపీ కాలు నాయక్. ఎంపీడీఓ శివరామిరెడ్డి. నాయకులు ఆనంద్ రెడ్డి. మేఘనాథ్ రెడ్డి. శివానందరెడ్డి. శేఖర్ రెడ్డి . రామ్మోహన్ రెడ్డి వెంకటకృష్ణారెడ్డి. పుల్లయ్య. నంద్యాల వెంకటేశ్వర్లు. బాల చెన్ని. మండలానికి చెందిన వైసిపి నాయకులు పంచాయతీ కార్యదర్శులు మండల వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు  పాల్గొన్నారు.

About Author