PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వలంటీర్ల సేవలకు వెలకట్టలేము…

1 min read

అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు  హొళగుందలో వలంటీర్లను సత్కరిస్తున్న అధికారులు, వైఎస్సార్సీపీ| నాయకులు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగ ఉంటూ గ్రామాల్లో వలంటీర్లు అందిస్తున్న సేవలకు వెలకట్టలేమని ఎంపీడీఓ ఆజాద్, తహసీల్దారు ప్రసాద్రారాజు, వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. బుధవారం హొళగుందలో వారు వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీపీ తనయుడు ఈశా, ఎంపీటీసీలు మల్లికార్జున, శివన్న, హనుమప్ప, దర్గన్న, సోమప్ప, జయన్న తదితరులతో కలిసి సేవారత్న, సేవామిత్ర అవార్డులు పొందిన వలంటీర్లను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో వలంటీర్లు చేస్తున్న సేవలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తగిన గుర్తింపు ఇచ్చి వారికి ప్రోత్సహాకాలు ఇచ్చి సత్కరించడం హర్శించదగ్గ విషయమన్నారు. పింఛన్, ఇతర అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే వెళ్లి అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజలకు చేస్తున్న సేవలు, సంక్షేమ పథకాలను దరి చేర్చడంలో వలంటీర్లదే కీలక పాత్ర అన్నారు. సీఎం తమ పై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండ వలంటీర్లు కూడ ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించాలని కోరారు. ఈ సందర్భంగ సేవారత్న అవార్డులు వరించిన వారితో పాటు మిగిలిన వలంటీర్లకు సేవామిత్ర అవార్డులు అందించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ చంద్రమౌళీశ్వరగౌడ్, పంచాయతీ సెక్రటరీలు రాజశేఖర్, రంగస్వామి, ఆరిఐ దినోజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author