PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తర ద్వారంలో..‘సూర్యుడి’దర్శనం

1 min read

పల్లెవెలుగు వెబ్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు భారీగా క్యూ కట్టారు. సోమవారం ఉదయం నగరంలోని సూర్యదేవాలయంలో  ఉదయం  భక్తులు ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి… సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. తులసీ  జలాభిషేకం, అర్చనలు చేశారు.  పూలు,ఫలములతో విశేష అలంకరించిన సూర్య నారాయణ స్వామివారి మూల విరాట్​కు  ధన్వంతరి హోమం, సుదర్శన హోమం నిర్వహించారు.  అనంతరం ఆలయ ట్రస్ట చైర్మన్​ రామకృష్ణారెడ్డి, సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు  అందజేశారు.

About Author