PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల సమస్యల పరిష్కారమే.. ఏఐఎస్​ఎఫ్​ ధ్యేయం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ :  ఏఐఎస్ఎఫ్ 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 4 5 తేదీలలో జరుగు కార్యక్రమాలను జయప్రదం చేయాలని పలుపునిచ్చారు ఆ యూనియన్​ నాయకులు.  సోమవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల మీదుగా తేరు బజారు గెస్ట్ హౌస్ జూనియర్ కళాశాల వరకు మోటార్ బైక్ ల తో ప్రచార ర్యాలీ చేపట్టారు. ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రచార హోరు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించి 48 సంవత్సరాలు కావస్తుందని ఈ సుదీర్ఘ కాలంలో విద్యార్థుల సమస్యల కోసం ఏఐఎస్ఎఫ్ అలుపెరగని పోరాటం చేసిందని అన్నారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఎన్నో త్యాగాలను చేసిందని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యల పట్ల ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు.

About Author