PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివ‌ర‌ణ కోరేందుకు `ఈనాడు` ఆఫీస్ కు వెళ్లిన ఎస్పీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పోలీసులపై కథనాలు రాస్తున్న ఈనాడుపై ఎస్పీ ఫకీరప్ప సీరియస్‌ అయ్యారు. ఈనాడు కథనాలపై వివరణ కోరేందుకు ఫకీరప్ప.. బుధవారం ఈనాడు కార్యాలయానికి వెళ్లి సిబ్బందికి నోటీసులు అందజేశారు. ఇటీవల ఉద్యోగం నుంచి డిస్మిస్‌ అయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రశాశ్‌పై ఇది వరకే పలుమార్లు సస్పెన్షన్‌ వేటు పడింది. కానిస్టేబుల్‌ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోగ్రామ్‌ సందర్భంగా ప్రకాశ్‌ నిరసన వ్యక్తం చేసినందుకే కానిస్టేబుల్‌ను డిస్మిస్‌ చేశారని ఈనాడు కథనాలు రాసింది. అంతేకాకుండా పోలీసు అధికారులను టార్గెట్‌ చేస్తూ వార్తలు రావడంతో వివరణ కోరేందుకు ఈనాడు కార్యాలయానికి వెళ్లిన ఫకీరప్ప సిబ్బందికి నోటీసులు ఇచ్చారు.

                                       

About Author