PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధాన్యము గోటితో వలుచు కార్యక్రమం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : భద్రాచలం లో వేంచేసియున్న శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం నందు ది.17.04.2023 న జరుగు శ్రీ స్వామి వారి కళ్యాణమునకు వినియోగించు గోటితో వలచిన తలంబ్రాలను శ్రీ రామ ఆద్యాత్మిక సేవా సంఘం జంగారెడ్డిగూడెం వారి ఆద్వర్యములో  శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ధాన్యమును గోటితో వలుచు కార్యక్రమము ప్రారంభమైనది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి  రమాదేవి  పాల్గొనినారు. వీరితో పాటు ఆలయ  ఏఈఓ మరియు భద్రాచలం  దేవస్థానం వేదపండితులు శ్రీ రామ ఆద్యాతిక సేవా సంఘం సభ్యులు మరియు భక్తులు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అర్చక సిబ్బంది మరియు వేద పండితులు పాల్గినరని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండల రావు తెలియజేశారు.

About Author