PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంకెల గారడితో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : వై నాగేశ్వరావు యాదవ్  రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్  కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పులతోనే రాష్ట్రాన్ని నడిపించాలనే ప్రణాళిక తోనే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూసి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్  కూడ హెచ్చరించారు. రూ.13వేల కోట్లు రెవెన్యూ లోటును… రూ.44వేల కోట్లకు, 35వేల కోట్ల ద్రవ్య లోటును రూ.60వేల కోట్ల కు పెంచిన ఘనత బుగ్గనదే… పన్నులు బాదుడు తప్ఫ బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమి లేవని అన్నారు. ప్రస్తుతం ఏపి అప్పులు రూ.11.58 లక్షల కోట్లు , మద్యం బాండ్లు రూ.16,000 కోట్లు. కార్పోరేషన్ హామీలు 1,10,603 కోట్లు. కార్పోరేషన్ తనఖాలు రూ.94,928 కోట్లు.డిస్కమ్ బకాయిలు రూ.27,284 కోట్లు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు రూ.95,400 కోట్లు వైసిపి ప్రభుత్వంలో ఏపి అప్పులు  రెట్టింపు అయ్యాయని అన్నారు. 2019లో టిడిపి తీసుకున్నా దాని కంటే 4రెట్లు అప్పు అయిందని, అప్పులాంధ్రప్రదేశ్ గా ఏపిని మార్చిన జగన్ అండ్ కో. వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రతి స్కీము స్కామ్ గా మారిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ధరలు పెంపు ,పన్నుల భారం, రిజిస్టర్ ఫీజు పెంపు , విద్యుత్ చార్జీలు పెంపు తో రాష్ట్ర ప్రజలు నలిగి పోతున్నారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల్లో రూ.కోట్లు అవినీతి, నాడు నేడు పేరుతో స్కూల్స్ కు వేసే రంగుల్లో 3వేల కోట్లు అవినీతి.మద్యం మీద వచ్చే డబ్బు తో జగన్ సర్కారు నడుస్తుందని అన్నారు. పేరుకే బీసీ సంక్షోమం… సబ్ ప్లాన్ నిధులు రూ.75వేల కోట్లు దారి మళ్లింపు,30 పథకాలు రద్దు చేశారని అన్నారు.అలాగే డోన్ నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గ ప్రజలు,మరియు కే యి &కోట్ల, &ఇంచార్జ్, మరియు రాష్ట్ర నాయకుల అభిప్రాయం మేరకే జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అభ్యర్థిని ప్రకటిస్తారు ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు ఎటువంటి అపోహాలు చెందకండి మొదటినుంచి పార్టీలో పని చేసిన కార్యకర్తలకు నాయకులకు వారి హోదాకు తగ్గట్టుగా గౌరవం కచ్చితంగా ఉంటుంది పార్టీ అభ్యర్థిని ఎవరిని ప్రకటించిన కూడా అందరూ కలిసి పనిచేసి డోన్ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించుకొని మన అప్పుల మంత్రిని ఇంటికి సాగనంపాలని వై నాగేశ్వరావు యాదవ్  కోరారు కార్యక్రమంలో పార్లమెంట్ అనుబంధ కమిటీ అధ్యక్షులు డి.జేంస్ (యస్.సి సెల్), హనుమంతరావు చౌదరి (సాంస్కృతిక విభాగం), మైనార్టి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్షా వలి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author