PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి మరోసారి.. అధికారమిస్తే రాష్ట్రం నాశనం…!

1 min read

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

గడివేముల, పల్లెవెలుగు: వైసిపి పాలన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని నాశనం చేసిందని రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిపిన  గొప్ప సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఏ ముఖం పెట్టుకొని రెండోసారి అధికారం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు శనివారం నాడు గడివేముల మండలంలోని దేశం సత్యనారాయణరెడ్డి కళ్లెంలో నాయకుల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ పాణ్యం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి గౌరూ చరిత రెడ్డి. నంద్యాల పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బైరెడ్డి శబరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కబ్జాలు మైనింగ్ మాఫియా మట్టి మాఫియా పరిశ్రమల వద్ద కమిషన్లు ఏది వదలలేదని ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకుంటాడని అభివృద్ధి చేసే పథకాన్ని ఆదాయ పథకంగా మార్చుకొని వందల కోట్లు కొల్లగొట్టాడని సామాన్య ప్రజలకు చుక్కలు చూపించిన ఈ ఎమ్మెల్యే మనకు అవసరం లేదని టిడిపి విజయానికి అందరూ కృషి చేయాలని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పాణ్యం నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు రెండు ఓట్లను టిడిపి కి వేయాలని నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కి ఓటు వేయాలని నియోజకవర్గంలో తన గెలుపు టిడిపికి ఓటు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెరుకుచర్ల రఘురామయ్య. మండల టిడిపి అధ్యక్షుడు దేశం సత్యం రెడ్డి . మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి. సీనియర్ నాయకుడు సీతారామరెడ్డి. పంట రామచంద్రారెడ్డి దుర్వేసి కృష్ణ యాదవ్ శ్రీనివాసులు. పంట దిలీప్ కుమార్ రెడ్డి. పంట మదిలేటి రెడ్డి . బత్తుల సుభద్రమ్మ. ఒడ్డు లక్ష్మీదేవి. ఎస్ ఏ రఫిక్. ఎస్ ఎ. ఫరూక్. ఎస్ ఏ ఖలీద్ మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author