PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్ గా ముగించాయి. మార్కెట్లు ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. అయితే, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయంట్లు లాభపడి 58,803కి పెరిగింది. నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 17,539 వద్ద స్థిరపడింది.

                                                  

About Author