PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలోనే లాభపడినా, రోజంతా లాభ నష్టాల మధ్య ఊడిసలాడాయి. చివరికి సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 53760 వద్ద నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 16,049 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 16వేల స్థాయిని ఎగువన ముగిసింది. కానీ సెన్సెక్స్‌ ఇంకా 54వేల దిగువనే ఉంది. డాలరు మారకంలో రూపాయి శుక్రవారం మరో రికార్డు కనిష్టానికి చేరింది. చివరికి 79.88 వద్ద స్థిరపడింది. గురువారం 79.90 వద్ద రికార్డు కనిష్టాన్ని టచ్‌ చేసి 79.89 వద్ద క్లోజ్‌ అయిన సంగతి తెలిసిందే.

                                       

About Author