PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. బడ్జెట్ బూస్ట్ తో లాభాల బాట పట్టిన సూచీలు అదే ఒరవడి కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఐటీ, ఫార్మా, ఫైనాన్సియల్ సెక్టార్లలో కొనుగోళ్లతో బుల్ రన్ కొనసాగుతోంది. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డీఎఫ్​ సీ మంచి ఫలితాలు ప్రకటించడంతో బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ తీసింది. మార్కెట్ అంచనాలను హెచ్ డీ ఎఫ్సీ బ్యాంక్ అందుకుంది. మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 633 పాయింట్ల లాభంతో 59496 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల లాభంతో 17762 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

           

About Author