PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది. 2023 మార్చిలో జరగనున్న ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిగా పులివెందుల ప్రాంతానికి చెందిన రామ్‌గోపాల్‌రెడ్డిని ఎంపిక చేశామని కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మార్చిలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధిస్థానం తనను ఎంపిక చేసిందన్నారు. తనను ఎంపిక చేసిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

                                

About Author