NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రాక్టర్,ట్రాలీని దొంగిలించిన దుండగులు

1 min read

– తెలిస్తే సమాచారం ఇవ్వండి:ఎస్ఐ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రంలో ట్రాక్టర్ మరియు ట్రాలీని దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది.ఎస్ఐ జి.మారుతి శంకర్ తెలిపిన వివరాల మేరకు మిడుతూరు గ్రామానికి చెందిన మానుకింది.వెంకటరమణ తనకు ఉన్న ట్రాక్టర్ మరియు ట్రాలీని తన కల్లంలో రోజు మాదిరిగా అక్కడ ట్రాక్టర్ ను ఉంచేవాడు.మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటరమణ కలంలో ఉన్న ట్రాక్టర్ నెంబర్ (ఏపీ 39 ఎన్ఎం 8422)మరియు ట్రాలీ నెంబర్(ఏపీ 39 ఎన్ క్యూ 7396)వీటిని గుర్తు తెలియని దుండగులు రాత్రి తీసుకువెళ్లారు.వెంకటరమణ బుధవారం ఉదయం తన కల్లం దగ్గరకి వచ్చి చూడగా అక్కడ ట్రాక్టర్ లేకపోవడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.ట్రాక్టర్ కు ముందు భాగం వైపున సన్నీ, సాయి అని పేర్లు రాసి ఉన్నాయని,ట్రాలీకి ఎడమవైపున వాసు అని ట్రాలీ వెనుక వైపున గుమ్మి అని పేర్లు రాసి ఉన్నాయని ఈట్రాక్టర్ ఎవరికైనా తెలిసిన యెడల మిడుతూరు ఎస్ఐ సెల్ నెంబర్-9121101189 కు తెలుపగలరని ఎస్ఐ తెలియజేశారు.ట్రాక్టర్ అదృశ్యం అయినందున ట్రాక్టర్ యజమాని ఎం.వెంకటరమణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

About Author