PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుద్యోగులు.. ఉద్యోగులుగా మారాలి: నడుగంటి చంద్రరేఖ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : నవ్యాంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘము కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నడుగంటి చంద్రరేఖను నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్​. కుమార్​ ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా నడుగంటి చంద్రరేఖ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో నిరుద్యోగులు.. ఉద్యోగులుగా మారేంత వరకు పోరాటం చేస్తానన్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేవరకు మరియు ప్రవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు కృషి చేస్తానని తెలిపారు. త్వరలో జిల్లాలోని 53 నియోజకవర్గాల్లో అధ్యక్షులను నియమిస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన నందికొట్కూరు నియోజకవర్గ అధ్యక్షులు కె. సీతారామయ్యకు, రాష్ట్ర అధ్యక్షులు ఎస్​. కుమార్​కు ఈ సందర్భంగా చంద్రరేఖ కృతజ్ఞతలు తెలిపారు.

About Author