PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాబోయే సార్వత్రిక ఎన్నికలు  పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే సమరం..

1 min read

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని

రాష్ట్ర ప్రజలందరూ వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు, ప్రతిపక్షాలు హత్య రాజకీయాలు చేస్తోంది..

ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని ఏలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. శ్రీరామ్ నగర్ లోని సారధి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో వైసిపి ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, ఒంటరిగా పోరాడుతున్నారని, పెత్తందార్లు, భూస్వాములు అవినీతిపరుల పక్షాన దుష్టశక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. పేదల పక్షాన నిలిచిన జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమని తేలిపోయిందని, ఈ కారణంగా ఈర్ష్య, ద్వేషాలతో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తెలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఏలూరు జిల్లాలోని ఎంపీ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలవాలన్నారు. ఆ దిశగా వైసిపి నాయకులు, కార్యకర్తలు పోరాడాలని, ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈనెల 18వ తేదీన  నామినేషన్ వేస్తున్నట్లు కార్యకర్తల హర్షద్వానాల మధ్య ఆళ్ళ నాని ప్రకటించారు. శ్రీరామ్ నగర్ లోని క్యాంప్ కార్యాలయం నుండి ఉదయం 9 గంటలకు పాదయాత్రగా బయలుదేరి అశోక్ నగర్, డీమార్ట్, సుబ్బమ్మ దేవి హై స్కూల్, చేపల తూము సెంటర్, 12 పంపులు సెంటర్, కొత్తపేట గంగానమ్మ గుడి, పాత బస్టాండ్, బిర్లాభం సెంటర్, గడియార స్తంభం మీదుగా తాసిల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి కుటుంబ సభ్యులందరూ వేలాదిగా పాల్గొనాలని ఆళ్ల నాని సూచించారు. వైసిపి ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గడపకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంచి చేశారని, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైసిపి క్యాడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడుకు పార్టీని తాకట్టు పెట్టి నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆళ్ల నానిని, ఎంపీగా తనను గెలిపించాలని వైసిపి నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే ఆళ్ల నానితో కలిసి ఏలూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశీ శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నేరుసు చిరంజీవిలు, మాజీ చైర్మన్ మంచెం మై బాబు, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గుర్నాథ్, నీతు విజయ్ కుమార్ జైన్, కార్పొరేటర్లు, అనుబంధాల సంఘాల నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.

About Author