PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బోగ‌స్ కంపెనీల పై ఈడీ దాడులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బోగ‌స్ కంపెనీల‌పై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ దాడులు ముమ్మ‌రం చేసింది. జార్ఖండ్, బిహార్, రాజస్థాన్, హర్యానా, దేశ రాజధాని నగరం ఢిల్లీలలోని 18 చోట్ల ఈడీ సోదాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచీ వచ్చిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలను ప్రారంభించారు. జార్ఖండ్ గనుల శాఖ కార్యదర్శి పూజ సింఘాల్, ఆమె భర్త ఆస్తులను కూడా ఈడీ అధికారులు తనిఖీ చేశారు. పూజ భర్తకు చెందిన ఓ ఆసుపత్రిలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.18 కోట్ల మేరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

                                         

About Author