PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన పోతురాజు చందు( 22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోయ వెంకటరమణ, లక్ష్మీ దేవి దంపతులకు చందు, అరుణ్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. తండ్రి వెంకటరమణ కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించారు. పొలం పనులు, ట్రాక్టర్ నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు.

మంగళవారం ఏపీ 39 జేకే 8547 పల్సర్ మోటార్ బైక్ పై నందికొట్కూరు నుండి స్వగ్రామం కొత్త ముచ్చుమర్రికి వెళుతూ కొణిదెల రోడ్డు  జీవ వనరుల కేంద్రం సమీపంలో బైక్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బంధువులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాని పోస్టుమార్టం కొరకు నందికొట్కూరు ప్రభుత్వ  వైద్యశాల కు  తరలించారు.

About Author