PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీలోకి వేదాంత

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వేదాంత సంస్థ త్వరలో భారత్‌లో సెమీ కండక్టర్ల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఇందుకుగాను 15 బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. తర్వాతి కాలంలో మరో ఐదు బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. సెమీ కండక్టర్ల వ్యాపారంలో ఉన్న… వేదాంత గ్రూప్ సంస్థ అవన్‌స్ట్రేట్… మరో మూడేళ్ళలో భారతీయ తయారీ ప్లాంట్ల నుండి ఎలక్ట్రానిక్ చిప్‌లు, డిస్‌ప్లేలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. భారత్‌లో సెమీకండక్టర్లను తయారు చేసే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో వేదాంత అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

                                

About Author