PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊరికొక వైసీపీ బూచోళ్లు ఉన్నారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : వైసీపీ నేతల పై టీడీపీ నేత నారా లోకేష్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో య‌థా లీడ‌ర్ త‌థా కేడ‌ర్ అన్నట్లుగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాధ‌నం 43 వేల కోట్ల దోపిడీ కేసులో జ‌గ‌న్‌ ఏ-1 అయితే ఎంపీ మోపిదేవి ఏ-7 అని ఆయన పేర్కొన్నారు. పాల‌కులే నేర‌గాళ్లయితే వాళ్ల అనుచ‌రులు పాల్పడే ఘోరాల‌కు అంతులేద‌ని మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ రైట్‌హ్యాండ్ భూశంక‌ర్ నిరూపించాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్పడిన భూశంక‌ర్ లాంటి వైసీపీ బూచోళ్లు రాష్ట్రంలో ఊరికొక‌డున్నాడని ఆయన అన్నారు.

    

About Author