PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది..

1 min read

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కావూరి లావణ్య

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు అభ్యర్థి కావూరి లావణ్య అన్నారు. స్థానిక చొదిమెళ్ళ ఆర్టీఓ ఆఫీసు రోడ్డు లోని ఆమె క్యాంపు కార్యాల యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లావణ్య మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ సమస్యలు కొన్ని ఉన్నాయని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేసిందని తెలిపారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యేవిధంగా అలాగే కొల్లేరు సమస్యల పై స్పందిస్తూ త్రాగునీరు లేక కొల్లేరు ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటి  పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో పోరాడనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తన అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తి మెజారిటీ సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు బంధువుగా స్థానికురాలనైన తనకు జిల్లా ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరారు. తన అభ్యర్థిత్వానికి కృషిచేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులకు, ఏఐసీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలిపారు. మీడియాతో అనుసంధానం రాబోయే రోజుల్లో ఎంతో అవసరం ఉందని తెలిపారు.

About Author