PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు

1 min read

– పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించి ఓటేయండి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల,సుంకేసుల గ్రామాలలో ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మీ ప్రథమ ఓటును వేయాలని కోరుతూ టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి మరియు మండల నాయకులు గుండం రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కోరారు.ఈప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదని అభివృద్ధి చేసింది అంతా శూన్యమేనని వారు అన్నారు.రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మీరు ఒక్కసారి ఆలోచించి టిడిపి అభ్యర్థి బలపరిచిన భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని వారు ఓటర్లను కోరారు.ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు మనోహర్ రెడ్డి,హరి సర్వోత్తమ్ రెడ్డి,మౌలాలి,మొహిద్దీన్,ఐటీడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author