NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ప్ర‌భుత్వానికి, క‌రోన‌కు తేడా లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌భుత్వానికి, క‌రోన‌కు పెద్ద తేడా లేద‌ని అన్నారు. రెండు ఇండ‌స్ట్రీ ఆదాయం త‌గ్గిస్తున్నాయ‌ని ఆర్జీవి పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వ వ్యవహార తీరును తప్పుపట్టారు. థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదన్నారు. అసలు వారు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఇండస్ట్రీ పెద్దలంటే.. అంతా బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవపడాలని ఎందుకు అనుకుంటారు? అందుకే వారంతా కామ్‌గా ఉంటున్నారని అన్నారు.

                             

About Author