NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నిప‌థ్ విష‌యంలో త‌గ్గేది లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మిలట్రీ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ మద్దతు పలికారు. ఈ పథకం ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని అన్నారు. దేశాన్ని అత్యంత సురక్షితంగా, పటిష్టంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోదీ ప్రదర్శిస్తున్న రాజకీయ ధైర్యం ప్రశంసనీయమని కొనియాడారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో డోవల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

                                

About Author