PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఢిల్లీ పాల‌కుల ఒత్తిడికి తలొగ్గేదే లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్ర‌భుత్వం పై ఎన్సీపీ నేత ఫైర్ అయ్యారు. ఎంతగా ఒత్తిడి చేసినా, ఢిల్లీ పాలకులకు తమ పార్టీ ఎప్పటికీ లొంగదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ తాజాగా తేల్చిచెప్పారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కాషాయ పార్టీని అధికారం నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇక్కడ జరిగిన ఎన్‌సీపీ 8వ జాతీయ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామికంగా సవాలు చేయాలి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ వంటి కేంద్ర విచారణ సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మన తరహాలోనే ఆలోచించే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తూ, బీజేపీని అధికారానికి దూరం చేయాలి’’ అని పవార్‌ స్పష్టం చేశారు.

                                                        

About Author